శుక్రవారం, ఆగస్టు 29, 2014

ఆయనంతే, మొండోడు.. పిచ్చోడు..

చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె, భుజంపై ఎర్ర తువాలు.. పాత తరం మధ్యతరగతి రైతు ఆహార్యంతో దాదాపు జీవితమంతా సంచారంలోనే గడిపిన ఎం.జె.ది అంతుపట్టని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం.

రాయలసీమలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా విప్లవ ప్రజాసంఘాలతో పరిచయమున్న వారందరూ ఆయనను మహామొండి మనిషిగా గుర్తిస్తారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏ పిలుపులేకపోయినా ఎక్కడినుండో వచ్చి ప్రత్యక్షమవుతాడు. ..

బుధవారం, ఆగస్టు 20, 2014

నా కొడకా మానందీరెడ్డి....

పచ్చశత్రీ సేతబట్టీ…
కిర్రు సెప్పూలేసుకోని
కట్ట మీదా పోతావుంటేరో…

నా కొడకా మానందీరెడ్డీ
నువ్వు కలకటేరనుకొంటిరో…

శుక్రవారం, ఆగస్టు 15, 2014

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి
ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి

అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో
ఉంటే మున్నూటికి మొనగాడు
ఆ.. పెట్టి మాటలు ఏదాలోన రండి శూరులారా..

గురువారం, ఆగస్టు 14, 2014

పాలెకత్తె హొన్నూరమ్మ

ఒకరోజు హొన్నూరమ్మ ధరించి ఉన్న చీరను వలుచుకుని వెళ్లగలమని గొల్ల బోయలు హెచ్చరిక చేశారు. దానిని ఒక సవాలుగా తీసుకున్న హొన్నూరమ్మ ఆ రాత్రి కోటలో పహారా కట్టుదిట్టం చేసింది. అన్నమాట ప్రకారం గొల్లబోయలు ఆ రాత్రి మూడవ జామున తమ శక్తియుక్తులతో రాణి మహలులోనికి ప్రవేశించారు. ఒకడు ద్వారం వద్ద ఉన్న సిపాయిని కొట్టి వాని బట్టలు వేసుకుని నిల్చున్నాడు. రెండవవాడు హొన్నూరమ్మ నిద్రించు పట్టెమంచము ముఖమల్ పట్టుపరదాల వెనుక దాక్కుని సిద్ధం చేసుకుని తెచ్చిన చిన్న డబ్బాకు అడుగున సన్నని రంద్రం చేసి డబ్బానిండుగా నీటిని నింపి ఒక పొడుగాటి కర్ర చివరకు డబ్బాను వేలాడదీసి పైకి ఎత్తి పట్టి చాటుగా...

బుధవారం, ఆగస్టు 13, 2014

శ్రీభాగ్ ఒప్పందం

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటిలో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

ఆనాటి ఒప్పందంలో రెండు ప్రాంతాల నాయకులు అంగీకరించి సంతకాలు చేసిన తీర్మానము యధాతధముగా క్రింద ఇవ్వబడినది:

ఆదివారం, ఆగస్టు 10, 2014

పోటెత్తిన విద్యార్థులు...

వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు ...


శుక్రవారం, మే 16, 2014

'ఈనాడు' ప్రవచించిన 'కడపస్వామ్యం'

యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే "తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది". ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం (బాక్స్ చూడండి) పేర కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి...

శుక్రవారం, మే 09, 2014

కడప జిల్లా పోలింగ్ విశేషాలు ...

కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు. జిల్లావ్యాప్తంగా జరిగిన ముఖ్య ఘటనల వివరాలు ...

బుధవారం, ఏప్రిల్ 30, 2014

బాబూ! నీ హయాంలో కడప జిల్లా ఆం.ప్ర మ్యాపులో ఉన్నట్లు మీకు కనబడితే కదా!!

పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి. కడప జిల్లాపై బాబుగారి చూపు ఎటువంటిదో తెలిపే కొన్ని ఉదాహరణలు ...

గురువారం, ఏప్రిల్ 17, 2014

విజయానంద్ ఐఏఎస్

పేరు : విజయానంద్ కే
విద్యార్హత : మెకానికల్ ఇంజనీరిగ్ లో ఎంటెక్ (జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం - అనంతపురం నుండి)
ఊరు : రాజుపాలెం (కడప జిల్లా)

శనివారం, ఏప్రిల్ 12, 2014

బుగ్గొంక - “నెహర్-ఎ-దావూదీ"

కడప నగరం మున్సిపాలిటీగా మారిన తర్వాత, ఎర్రముక్కపల్లె, నాగరాజుపేట, సున్నపురాళ్ళపల్లె, గుంతబజార్ ప్రాంతాలకు బుగ్గ నుంచి మంచి నీటిని గొట్టాల ద్వారా అందించే వారు. ఈ నీటి కోసమే తక్కిన ప్రాంతాల వారు కూడా పరుగులు తీసేవారు. ఈ నీరు రుచిగా ఉండటంతో పాటు, వారాల కొద్ది నిలువ ఉంచినా నీరు కలుషితం కాకపోవడం వలన అపురూపమైనదిగా భావించే వారు.

గురువారం, ఏప్రిల్ 10, 2014

K.S.జవహర్‌రెడ్డి ఐఏఎస్

K.S.జవహర్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాలలో విధులు నిర్వర్తించారు. K.S.జవహర్‌రెడ్డి ప్రొఫైల్, ఫోటోలు, ఇతరత్రా వివరాలు ...

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

డిఎల్ సైకిలెక్కినట్లేనా!

దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. 

సోమవారం, ఏప్రిల్ 07, 2014

ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తా!

కడప లోక్‌సభ ఎన్నికల్లో గతంలో పలు అవకాశాలు తృటిలో జారిపోయాయని - తనకు ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తానని చెప్పారు. 
మొత్తానికి లోక్ సభ అభ్యర్తిత్వం ఖరారైతే ఎన్నికలలో మరోమారు నిధుల వరద పారించేందుకు  కందుల సోదరులు సిద్ధమయ్యారన్నమాట! ఇప్పటికే డిఎల్ కడప తెదేపా లోక్ సభ అభ్యర్తిత్వం ఆశిస్తుండగా ఆశావాహుల జాబితాలో కందుల బ్రదర్స్ చేరారు. మరి బాబు ఈ అంశాన్ని ...

కడప జిల్లాపై చంద్రబాబుగారి వంకర చూపు

నష్టాల బాట పట్టాయని చెప్పి కడప సహకార చెక్కెర కర్మాగారాన్ని, ప్రభుత్వ ఆధీనంలోని ప్రొద్దుటూరు పాల కర్మాగారాన్ని మూయించేసి వాటిపై ఆధారపడ్డ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపకుండా వదిలేశారు. అదేమని అడిగితే సంస్కరణలు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నందలూరు ఆల్విన్ కర్మాగారాన్ని బాబుగారు 1999లో ప్రయివేటు పరం చేశారు. 

ఆదివారం, ఏప్రిల్ 06, 2014

సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన ఒకటి మేధావులుగా  చలామణీ అవుతున్న ఒక వర్గం నోట   తరచూ  వినిపిస్తోంది  - అదేమంటే  'సదువుకున్న వాళ్ళెవరైనా వైకాపాకు ఓటేస్తారా?' ...

శనివారం, ఏప్రిల్ 05, 2014

కడప జిల్లాలో చెంచుల వీధి భాగవతం

ఉగాది సందర్భంగా (అదే రోజు) సోమవారం రాత్రి జరిగిన శ్రీ జనార్ధనస్వామి తిరుణాళలో ప్రదర్శించిన చెంచు (చెంచులక్ష్మి వీధిబాగవతం) నాటకం ప్రేక్షకులను అలరింపచేసింది. అలయ ధర్మకర్త పగిడి రంగయ్య దాసు ఆధ్వర్యంలో ఈ తిరుణాల , వీధి నాటక ప్రదర్శన జరిగింది.
రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున 4 గంటల దాకా జరిగిన ఈ చెంచు నాటకాన్ని వందలాది మంది ప్రేక్షకులు కదలకుండా ఆసక్తిగా తిలకించడం ...

శుక్రవారం, మార్చి 28, 2014

కడప జిల్లాలో 20.75 లక్షల ఓటర్లు

జిల్లాలో 20.75 లక్షల ఓటర్లున్నారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 30 శాతంగా  ఉన్న యువతరం ఓట్లు మన నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి.
తొలుత కడప కార్పొరేషన్ , పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు ...

గురువారం, మార్చి 13, 2014

అది సీమ సంస్కృతా?

నిన్నటి వరకు తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో, తెలంగాణా సంస్కృతి పేరుతొ ఉద్యమం చేపట్టిన గులాబీ దళపతి ఇప్పుడు  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల్ లో సీమ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం ...

సోమవారం, మార్చి 10, 2014

కడప జిల్లా మండలాధ్యక్ష స్థానాల రిజర్వషన్ల వివరాలు

కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు.  మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలు..

బుధవారం, మార్చి 05, 2014

తవ్వా ఓబుల్ రెడ్డి కథ 'కడుపాత్రం'

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూడొచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, ...

శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

2011 జనాల లెక్కలు ...

జిల్లాలోని జనాల(భా) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి ...

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం...

గురువారం, ఫిబ్రవరి 20, 2014

రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) కథ 'ఓడిపోయిన సంస్కారం'

ఈ రామనాధం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఔను – భర్త గుణగణాలమీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడుతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే ? – ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో? మొదట మంచివాళ్ళుగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో?

గురువారం, ఫిబ్రవరి 13, 2014

ప్రపంచంలోకెల్లా ప్రత్యేక నిక్షేపాలు కడప జిల్లాలో ....

మంగంపేటలో  నిక్షేపాలున్నట్లు మొదటగా 1872లో డబ్ల్యు.కింగ్ అనే బ్రిటీషు అధికారి చేసిన సర్వే ద్వారా వెల్లడయ్యింది. ప్రపంచంలోనే 28శాతం ముగ్గురాయి (బైరైటీస్) నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. భారతదేశంలో లభ్యమయ్యే ముగ్గురాయిలో 98 శాతం మంగంపేట గనుల నుండే ...

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

గండికోట శ్రీరామచంద్రునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన

కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి 
ప||  రాజవు నీకెదురేదీ రామచంద్ర     
రాజీవ నయనుడ రామచంద్ర 

చ|| వెట్టిగాదు నీవలపు 
వింటి నారికి దెచ్చితిని 
(ర)ఱట్టు సేయ బనిలేదు 
ఇట్టే రామచంద్ర ..

శనివారం, ఫిబ్రవరి 08, 2014

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన

చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం: సామంత       కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ ...

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే!

ఖమ్మంజిల్లా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. పనులు మొదలై మధ్యలో నిలిచిపోయిన బ్రహ్మణిని పూర్తిచేసే అంశాన్ని ఎందుకు చేర్చలేదు? 
 పోలవరం కడతామంటున్నారు. సీమలో మంచినీళ్లుకూడా లేవు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికైనా నిధులు ఇస్తామని ఎందుకు చెప్పడంలేదు?

మంగళవారం, ఫిబ్రవరి 04, 2014

ఫేస్‌బుక్ లో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు …

ఇక ఇరు పార్టీల శ్రేణులు, అభిమానులు ఫేస్‌బుక్ వేదికగా ఒకరి పైన మరొకరు పదునైన వ్యాఖ్యలు, పంచ డైలాగ్ లు వదులుతున్నారు. వీటిలో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. వ్యంగాస్త్రాలు, పదునైన మాటల తూటాలతో ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న ఈ సమరం సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత ఘాటెక్కనుంది.

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

ఈపొద్దు ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ

ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు ఎన్నికల పోలింగ్, 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు జరుగుతూ ఉండగానే అధ్యక్ష పదవికి పోలింగ్ అవసరమైతే మరో వైపు నిర్వహిస్తారని...

శుక్రవారం, జనవరి 31, 2014

మూడు రోజులకు ముందు సరసోక్తులాడుకొన్న గొంతు మూగబోతే …

“మామా!… ఒక్కసారి నువ్వు క్వార్టర్స్‌కి రా!” తేనెలద్దిన గొంతు నుండి మంద్రస్థాయిలో మధురమైన పిలుపు. మధురస్వరం ఒక వరమైతే ఆ అదృష్టం ఆరవేటిదే! పోద్దుగూట్లో పడబోతున్న వేళ – అప్పుడు ఆరవేటి పిలుపు – ఎందుకో విందుకో అని నవ్వుకుంటూ బయలుదేరాను. నా జీవితంలో అలా స్వతంత్రించి పిలువగలిగిన వాళ్లు చాలా కొద్ది మంది. ఆ కొద్దిమంది....

గురువారం, జనవరి 23, 2014

‘ఫూలోంకి సేజ్’ కాస్తా ‘కాంటోంకీ సేజ్’ అయ్యింది.

అంజలి పిక్చర్స్ బ్యానర్‌లో 1962లో అనుకుంటా! అశోక్ కుమార్, మనోజ్‌కుమార్, వైజయంతిమాల వంటి మేటి తారలతో ‘ఫూలోంకి సేజ్’ (పూలపాన్పు) అనే సినిమా తీశాం. విడుదలయ్యే సరికి అది కాస్తా ‘కాంటోంకీ సేజ్’ (ముళ్ళ పాన్పు) లా తయారయ్యింది. ఆ సినిమా కారణంగా చాలా నష్టపోయాం. ఇండ్రస్టీలో ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు....

పూర్తి వివరాలు ...

ఆదివారం, జనవరి 19, 2014

కేతు విశ్వనాధ రెడ్డి కథ 'కూలిన బురుజు'

ఇది ఊరా? వల్లకాడ? ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జలదరించింది. ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచి ఉన్నాయి. ఎగువ వీధిలో, ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళారు.
ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను. బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడూ ఉండే జనం లేరు. బురుజు పైకి చూశాను. సగం పడిపోయింది. పైన పిచ్చిమొక్కలూ… ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకూ, ఐక్యతకూ సంకేతం. ఇప్పుడో?