శనివారం, ఆగస్టు 31, 2013

విభజన తర్వాత రాయలసీమ పరిస్థితి …

నిజమే.తెలంగాణ ఏర్పాటు తర్వాత కృష్ణాజలాల వినియోగం మొత్తం కేంద్ర బోర్డు అజమాయిషీలోకి వెళుతుంది కాబట్టి.. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలు మినహా అదనంగా మిగులు జలాల లభ్యత కూడా కష్టమే ....

బుధవారం, ఆగస్టు 28, 2013

ఆనాడే చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల వేల సంవత్సరాలవి కాగా మద్రాసు లేదా చెన్నపట్టణం అని పిలువబడుతూ ఉండిన నేటి ‘చెన్నయ్‌’ నగర చరిత్ర క్రీస్తు శకం పదిహేడో శతాబ్దం మధ్య కాలం నుంచే మొదలయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయినా గువ్వల చెన్న శతకంలోని ఈ రెండు పద్యాలు...

సోమవారం, ఆగస్టు 26, 2013

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1
శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని
కోపామునేసి కొట్టగా...
పూర్తి  వివరాలు

వాళ్ల గులాములుగా బ్రతాకాల్సి వస్తుందా!

ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే మేమంతా సర్కార్‌ ఆంధ్ర వాళ్లక్రింద గులాములుగా బ్రతాకాల్సి వస్తుంది. అసెంబ్లీలో రాయలసీమ కు చెందిన ఎమ్మెల్యేలు 53 మంది మాత్రమే ఉంటారని, అదే కోస్తా ఆంధ్రలో 112 మంది ఎమ్మెల్యే లు...

ఆదివారం, ఆగస్టు 25, 2013

అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

కోకట గ్రామాద్యనేకాగ్రహారాల్లో రాయలు కోకటం గ్రామాన్ని మొదట పెద్దనకు సమర్పించాడు. కళింగం మీదికి దండెత్తిన సమయంలో వైశాఖ పూర్ణిమ చంద్రగ్రహణ సమయాన కోకటం గ్రామంలోని కొంతపొలాన్ని కోకటంలోని సకలేశ్వరునికి...

సలీం అలీ ఉద్విగ్నం

రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఐతన్న అనే గొర్రెల కాపరి అడవికి వేటకు వెళ్ళేవాడు. అతనికి 1986 జనవరి 5వ తేది రాత్రి అడవిలో వేటాడుతుండగా కొత్తరకం పక్షుల జంట కనబడింది. ఐతన్నకు వెంటనే ఆలోచన తట్టింది. శాస్త్రవేత్తలు, అధికారులు వెదుకుతున్న పక్షి ఇదేనని భావించాడు. పోస్టర్లలోని పోటోతో ఈ పక్షులను పొల్చుకుని నిర్థారించుకున్నాడు. ఆ పక్షుల జంటలో ఓ పక్షిని అతి కష్టంమీద పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. 

శనివారం, ఆగస్టు 24, 2013

అదేనా పేదరికం అంటే?

యువరాజా వారు నిద్ర లేచారు. అదేంటోగానీ రాత్రుళ్ళు ఎంతసేపు నిద్రపోయినా వారికి లేచేసరికి బద్ధకంగానే ఉంటుంది. బలవంతాన లేచినా రోజంతా ఏం చెయ్యాలో తోచిచావదు. నాన్నగారు పోయిన తర్వాత ఒక ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నప్పట్నించి నోరూవాయీలేనివాడొకణ్ణి ప్రధానమంత్రిగా పెట్టుకుని ...

సోమవారం, ఆగస్టు 19, 2013

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి?

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఎందుకు పెంచింది?

ప్రభుత్వం తనంతట తానుగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచిందా?

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణపై తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును మాత్రమె ఈ రకంగా విస్తరించారా?

శనివారం, ఆగస్టు 17, 2013

సీమ పై విషం కక్కిన మేధావి

నికర జలాల కేటాయింపు పొందిన సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాలను గురించి వీరి బాధ చూడండి. అంతేనా పనిలో పనిగా ప్రభుత్వాన్నీ తిట్టి పోశారు – విద్యుత్తు గురించి. వారికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోకుండా దానికే ఫిక్సయిపోయి – మిగులు జలాలు లేదా వరద జలాల మీద ఆధారపడ్డ సీమ వాసులు దౌర్జన్యం, దోపిడీ చేశారు అంటారు. 
ఇదీ మేధావి గారి డొల్ల వాదన. ఇదంతా తెలంగాణా ప్రజల మనస్సులో సీమ వాసులపై విషం నింపటం .... 

గురువారం, ఆగస్టు 15, 2013

ఉద్యమ బాట పట్టవలసినది రాయలసీమే...

1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ఆధ్వర్యంలో కృష్ణా- పెన్నార్‌ ప్రాజెక్ట్‌ రూపొందింది. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కూడా వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. 

సీమవాసులకు చుక్క నీరు అందని విధంగా 1954లో రాయలసీమకు దిగువ భాగాన ‘నాగార్జునసాగర్‌’గా నిర్మించారు. 23 లక్షల ఎకరాలకు సాగునీరు తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. రాయలసీమకు మొండిచెయ్యి .... 

మంగళవారం, ఆగస్టు 13, 2013

శృంగార కరుణ హాస్యాల సమ్మేళనం

”గాథా త్రిశతి’’ శృంగార కరుణ హాస్యాల సమ్మేళనం. అలంకార శాస్త్రవేత్తలు ఆశించే ధ్వనికి రసాలంకారాలకు ఈ గాథలు మకుటాయమానంగా నిలుస్తాయి అనడంలో ఎట్టి సందేహమును లేదు.

ఆదివారం, ఆగస్టు 11, 2013

‘దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం’

 డా. లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!

శనివారం, ఆగస్టు 10, 2013

కమ్యూనిస్టు ఉద్యమ ఆణిముత్యం

"గాడ్‌ ఈజ్‌ క్రియేటెడ్‌ బై మాన్‌” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక సన్యాసి అయితే, ”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న ధవళ వస్త్రాల్లో ఉన్న రాజకీయ సన్యాసి కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వరరెడ్డి.

శుక్రవారం, ఆగస్టు 09, 2013

గురువారం, ఆగస్టు 08, 2013

మత్తులో జోగిన సీమ ముఖ్యమంత్రులు

అధికారం  లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు.

బుధవారం, ఆగస్టు 07, 2013

ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం చేయడం కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఏ ప్రభుత్వానికి అలవాటే. ఆ అలవాటు నుండి వెలువడిందే ఈ అసంబద్ధ, అసంపూర్తి ప్రకటన....

గురువారం, ఆగస్టు 01, 2013

గాంధీజీకి, కడప హరిజనులకు మధ్య జరిగిన సంభాషణ

కడపలో గాంధీజీ విశ్రాంతి తీసుకుంటున్న రోజున (1934 జనవరి 1) కొందరు స్థానిక హరిజనులు ఆయనను కలుసుకొని సంభాషించారు.... 

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ సంభాషణ కడప జిల్లా హరిజనుల చైతన్యాన్ని, ముక్కుసూటితనాన్ని వ్యక్తీకరించింది. 

గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన ఆ సంభాషణ ....