శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

2011 జనాల లెక్కలు ...

జిల్లాలోని జనాల(భా) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి ...

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం...

గురువారం, ఫిబ్రవరి 20, 2014

రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) కథ 'ఓడిపోయిన సంస్కారం'

ఈ రామనాధం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఔను – భర్త గుణగణాలమీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడుతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే ? – ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో? మొదట మంచివాళ్ళుగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో?

గురువారం, ఫిబ్రవరి 13, 2014

ప్రపంచంలోకెల్లా ప్రత్యేక నిక్షేపాలు కడప జిల్లాలో ....

మంగంపేటలో  నిక్షేపాలున్నట్లు మొదటగా 1872లో డబ్ల్యు.కింగ్ అనే బ్రిటీషు అధికారి చేసిన సర్వే ద్వారా వెల్లడయ్యింది. ప్రపంచంలోనే 28శాతం ముగ్గురాయి (బైరైటీస్) నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. భారతదేశంలో లభ్యమయ్యే ముగ్గురాయిలో 98 శాతం మంగంపేట గనుల నుండే ...

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

గండికోట శ్రీరామచంద్రునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన

కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి 
ప||  రాజవు నీకెదురేదీ రామచంద్ర     
రాజీవ నయనుడ రామచంద్ర 

చ|| వెట్టిగాదు నీవలపు 
వింటి నారికి దెచ్చితిని 
(ర)ఱట్టు సేయ బనిలేదు 
ఇట్టే రామచంద్ర ..

శనివారం, ఫిబ్రవరి 08, 2014

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన

చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం: సామంత       కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ ...

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే!

ఖమ్మంజిల్లా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. పనులు మొదలై మధ్యలో నిలిచిపోయిన బ్రహ్మణిని పూర్తిచేసే అంశాన్ని ఎందుకు చేర్చలేదు? 
 పోలవరం కడతామంటున్నారు. సీమలో మంచినీళ్లుకూడా లేవు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికైనా నిధులు ఇస్తామని ఎందుకు చెప్పడంలేదు?

మంగళవారం, ఫిబ్రవరి 04, 2014

ఫేస్‌బుక్ లో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు …

ఇక ఇరు పార్టీల శ్రేణులు, అభిమానులు ఫేస్‌బుక్ వేదికగా ఒకరి పైన మరొకరు పదునైన వ్యాఖ్యలు, పంచ డైలాగ్ లు వదులుతున్నారు. వీటిలో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. వ్యంగాస్త్రాలు, పదునైన మాటల తూటాలతో ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న ఈ సమరం సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత ఘాటెక్కనుంది.

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

ఈపొద్దు ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ

ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు ఎన్నికల పోలింగ్, 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు జరుగుతూ ఉండగానే అధ్యక్ష పదవికి పోలింగ్ అవసరమైతే మరో వైపు నిర్వహిస్తారని...